ఆటో బోల్తా.. ఐదుగురికి గాయాలు

7 Feb, 2016 12:22 IST|Sakshi

ప్రయాణికులతో వెళ్తున్న ఆటో అదుపుతప్పి బోల్తా కొట్టిన ప్రమాదంలో ఐదుగురికి తీవ్ర గాయాల య్యాయి. అందులో ఇద్దరి పరిస్థితి విషమంగా ఉంది. ఈ సంఘటన వరంగల్ జిల్లా మరిపెడ శివారులోని తండా సమీపంలో ఆదివారం ఉదయం చోటుచేసుకుంది. మరిపెడ వస్తున్న ఆటో తండా వద్దకు రాగానే అదుపుతప్పి బోల్తా కొట్టింది. దీంతో ఆటోలో ఉన్న ఐదుగురు ప్రయాణికులకు తీవ్ర గాయాలయ్యాయి. ఇది గుర్తించిన స్థానికులు క్షతగాత్రులను ఆస్పత్రికి తరలించి పోలీసులకు సమాచారం అందించారు.

 

>
మరిన్ని వార్తలు