నకిలీ బంగారం విక్రయించే ముఠా గుట్టు రట్టు

25 Dec, 2015 08:12 IST|Sakshi

కరీంనగర్ : కరీంనగర్ జిల్లా గోదావరిఖనిలో నకిలీ బంగారం, వజ్రాలు విక్రయించే ముఠా గుట్టును శుక్రవారం పోలీసులు రట్టు చేశారు. ముఠాకు చెందిన ఎనిమిది మందిని పోలీసులు అరెస్ట్ చేశారు. వారి వద్ద నుంచి 134 నకిలీ బంగారం బిస్కెట్లు, 57 నకిలీ వజ్రాలు స్వాధీనం చేసుకున్నారు. అనంతరం వారిపై పోలీసులు వివిధ సెక్షన్ల కింద కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.

మరిన్ని వార్తలు