గిరిజనులు చదువు పై దృష్టి పెట్టాలి: గవర్నర్

15 Feb, 2016 12:56 IST|Sakshi
పాలకొండ: గిరిజనులు చదువు పై దృష్టి పెట్టాలని ఉమ్మడి తెలుగు రాష్ట్రాల గవర్నర్ ఈఎస్‌ఎల్ నరసింహన్ అన్నారు. శ్రీకాకుళం జిల్లా సీతంపేటలోని పీఎమ్‌ఆర్సీలో సోమవారం గిరిజన మహిళా సంఘాలతో ఏర్పాటు చేసిన ముఖాముఖి కార్యక్రమంలో పాల్గొన్న ఆయన మాట్లాడుతూ... గిరిజన కుటుంబ వ్యవస్థను పటిష్ట పరుచుకోవాలని, చదువు నేర్చుకొని కుటుంబంతో పాటు గ్రామానికి బాసటగా నిలవాలన్నారు. గిరిజనుల ఆర్థిక వనరులు కాపాడుకునే విధంగా చర్యలు చేపట్టాలని సూచించారు. ఆయనతో పాటు ఎమ్మెల్యేలు, పలు పార్టీల నాయకులు ఉన్నారు.
 
>
మరిన్ని వార్తలు