సీఎంవోకు గ్రూప్ అభ్యర్థుల లేఖ

24 Mar, 2016 14:07 IST|Sakshi

హైదరాబాద్: గ్రూప్-2 పరీక్షను వాయిదా వేయాలంటూ అభ్యర్థులు తెలంగాణ సీఎంవో కు లేఖ రాశారు. తక్కువ పోస్టులు, సరైన మెటీరియల్ లేకపోవడం వల్ల పరీక్షను పోస్ట్ పోన్ చేయాలని వారు విజ్ఞప్తి చేశారు.  ‘గ్రూప్-2 లో పోస్టుల సంఖ్య పెంచాలని, ఇంటర్వ్యూను కూడా మినహాయించాలని అభ్యర్థులు లేఖలో కోరారు. ఎంతో మంది విద్యార్థులు పల్లెల నుంచి నగరానికి వచ్చి రూ.వేలల్లో వెచ్చించి కోచింగులు తీసుకుంటున్నారని తెలిపారు. ఆర్‌ఆర్‌బీ, కానిస్టేబుల్ పరీక్షలు ఒకే సమయంలో ఉండటంతో ఆ పరీక్షలు ఎలా రాస్తారని వారు ప్రశ్నించారు. పోటీ పరీక్షలకు కావల్సిన సిలబస్, తెలుగు అకాడమీ, గ్రూప్-2 బుక్స్‌ను విడుదల చేయాలన్నారు.


 
 

మరిన్ని వార్తలు