జాతీయ రహదారుల్లో భారీగా ట్రాఫిక్ జామ్

13 Aug, 2016 11:11 IST|Sakshi
హైదరాబాద్: ఆంధ్ర, తెలంగాణ రాష్ట్రాల్లో కృష్ణా పుష్కరాల సందర్భంగా భక్తుల రద్దీ పెరిగింది. వరుస సెలవులు కావడంతో పుష్కరాలకు వెళ్లే వాహనాలతో రెండు రాష్ట్రాల్లో జాతీయరహదారులు కిక్కిరిసిపోయాయి. టోల్‌ప్లాజాల వద్ద కిలోమీటర్ల మేర వాహనాలు నిలిచిపోయాయి. హైదరాబాద్-కర్నూలు, హైదరాబాద్-విజయవాడ రహదారుల్లో వాహనాలు భారీ సంఖ్యలో నిలిచిపోవడంతో భక్తులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. భద్రత నిమిత్తం రాయ్‌కల్ టోల్‌ప్లాజా వద్ద పోలీసులు వాహనాలను తనిఖీలు చేపట్టారు.
మరిన్ని వార్తలు