తిరుమల: తిరుమల శ్రీ వెంకటేశ్వర స్వామిని పలువురు ప్రముఖులు దర్శించుకున్నారు. బుధవారం ఉదయం వీఐపీ ప్రారంభ దర్శన సమయంలో తమిళ నటుడు మాధవన్, గాయని గీతామాధురి కుటుంబ సమేతంగా స్వామివారిని దర్శించుకున్నారు. అనంతరం వారికి అధికారులు స్వామివారి తీర్థప్రసాదాలు అందజేశారు.