అవసరమైతే అణుబాంబులు ఉపయోగిస్తాం: పాక్

9 Jul, 2015 08:07 IST|Sakshi

ఇస్లామాబాద్: తమ దేశ మనుగడ కోసం అవసరమైతే అణుబాంబులు ఉపయోగిస్తామని పాకిస్తాన్ రక్షణ మంత్రి ఖ్వాజా అసిఫ్ అన్నారు. 'అణుబాంబులను ఉపయోగించడం మాకు ఉన్న ఐచ్ఛికాల్లో ఒకటి. వాటిని కేవలం ప్రదర్శన కోసం ఉంచడం లేదు. అవసరమైతే కచ్చితంగా అణుబాంబులను ఉపయోగిస్తాం. కానీ, ఆ అవసరం ఉత్పన్నం కాకూడదని ప్రార్థిస్తున్నాం' అని ఓ వార్తా చానల్‌తో పేర్కొన్నారు. ఉగ్రవాదం పేట్రేగిపోతుండటం భారత్, పాక్‌ల మధ్య పరోక్ష యుద్ధానికి దారి తీస్తోందన్నారు.

మరిన్ని వార్తలు