రూ. కోటిన్నర స్వాహా చేసిన బ్యాంక్ మేనేజర్

18 Dec, 2015 08:20 IST|Sakshi

విజయవాడ : కృష్ణాజిల్లా నూజివీడు మండలం గొల్లపల్లి లోని ఇండియన్ బ్యాంక్లో చోటు చేసుకున్న కుంభకోణం శుక్రవారం వెలుగులోకి వచ్చింది. రుణాల మంజూరు పేరుతో రూ. కోటిన్నర స్వాహా చేసినట్లు బ్యాంక్ ఉన్నతాధికారులు గుర్తించారు. ఈ నేపథ్యంలో  విచారణ ప్రారంభించారు.  ఈ కుంభకోణంలో బ్యాంక్ మేనేజర్ విజయ్ వర్ధన్ కీలక సూత్రధారి అని ఇండియన్ బ్యాంక్ ఉన్నతాధికారులు కనుగొన్నారు. ఈ నేపథ్యంలో ఆయన్ని విధుల నుంచి తప్పిస్తు ఉన్నతాధికారులు ఆదేశాలు జారీ చేశారు. 

>
మరిన్ని వార్తలు