తిరుమల కొండపై మద్యం బాటిళ్లు

17 Jun, 2017 09:34 IST|Sakshi
తిరుమల కొండపై మద్యం బాటిళ్లు

► ఆరుగురు అరెస్ట్‌

తిరుమల: తిరుమలలో విజిలెన్స్‌ సెక్యూరిటీ డొల్లతనం మరోసారి బయటపడింది. నిబంధనలకు విరుద్ధంగా కొండపైన మద్యం బాటిళ్లు కలిగి ఉన్న ఆరుగురిని ఎక్సైజ్‌ పోలీసులు శనివారం అరెస్ట్‌ చేశారు. శుక్రవారం రాత్రి నుంచి ఎక్సైజ్‌ అధికారులు తనిఖీలు నిర్వహించగా.. భవన నిర్మాణ కూలీలు, హోటళ్లలో పని చేస్తున్న ఆరుగురి వద్ద నుంచి 20 మద్యం సీసాలతో పాటు గుట్కా ప్యాకెట్లు స్వాధీనం చేసుకున్నారు.

మరిన్ని వార్తలు