పొంచి ఉన్న మరో అల్పపీడనం ముప్పు

6 Dec, 2015 13:24 IST|Sakshi

చెన్నై: ఆగ్నేయ బంగాళాఖాతంలో అల్పపీడనం ఏర్పడింది. దీని ప్రభావంతో తమిళనాడు తీరప్రాంతాల్లో మరో రెండు రోజుల పాటు వర్షాలు కురిసే అవకాశం ఉన్నట్లు చెన్నై వాతావరణ శాఖ తెలిపింది. తీర ప్రాంతాలలోని ప్రజలు అప్రమత్తంగా ఉండాని సూచించింది.ఇప్పటివరకు రికార్డు స్థాయిలో 1,579 మిల్లీ మీటర్ల వర్షపాతం నమోదైనట్లు తెలిపింది. వర్షాలు కాస్త తగ్గుముఖం పట్టడంతో ఇప్పుడిప్పుడే చెన్నై కోలుకుంటుంది. సహాయక కార్యక్రమాలు ముమ్మరంగా సాగుతున్నాయి. అంతలోనే మళ్లీ వర్షాలు కురిసే అవకాశం ఉందని చెబుతుండటంతో ప్రజలు ఆందోళన చెందుతున్నారు.

 

మరిన్ని వార్తలు