పిల్లల్ని చంపి ఆత్మహత్యకు పాల్పడ్డ తల్లి

23 Mar, 2016 13:27 IST|Sakshi

బుచ్చిరెడ్డిపాలెం మండలం జొన్నవాడలో బుధవారం విషాదం చోటుచేసుకుంది. ఓ తల్లి తన ఇద్దరు పిల్లలతో కలిసి ఆత్మహత్యకు పాల్పడింది. జొన్నవాడ గ్రామానికి ప్రవల్లిక(27) తన ఇద్దరు పిల్లలపై కిరోసిన్ పోసి తానూ నిప్పంటించుకుంది.ఈ ఘటనలో లాస్య(5), రేష్మ(2) అనే చిన్నారులతో పాటు తల్లి కూడా ప్రాణాలు కోల్పోయింది. కుటుంబకలహాల నేపథ్యంలోనే ఈ ఘటన జరిగినట్లు తెలిసింది. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.

 

మరిన్ని వార్తలు