కొవ్వూరు గౌతమిఘాట్‌లో తుపాకీ కలకలం

16 Jul, 2015 10:23 IST|Sakshi

కొవ్వూరు : పశ్చిమగోదావరి జిల్లా కొవ్వూరు గౌతమి మహర్షి పుష్కరఘాట్‌లో గురువారం తుపాకీ కలకలం సృష్టించింది. గురవారం పుష్కరఘాట్‌లో పని చేసే కార్మికులు ఓ వ్యక్తి వద్ద తుపాకీని గుర్తించి పోలీసులకు సమాచారం అందించారు. పోలీసులు తుపాకీని స్వాధీనం చేసుకొని, అతనిని  అదుపులోకి తీసుకుని విచారణ చేస్తున్నారు.

 కాగా, సీఎం చంద్రబాబు నేడు జిల్లా పర్యటనను దృష్టిలో ఉంచుకొని భారీ బందోబస్తును ఏర్పాటు చేశారు. అయినా తుపాకీ బయటపడటం కలకలం రేపుతోంది.
 

మరిన్ని వార్తలు