పేకాట శిబిరాలపై దాడులు

1 Mar, 2016 08:26 IST|Sakshi
హైదరాబాద్: నగరంలోని ఎస్ఆర్ నగర్ పీఎస్ పరిధిలోని ఎల్లారెడ్డిగూడలోని పేకాట శిబిరాలపై మంగళవారం వేకువజామున పోలీసులు దాడి చేశారు. ఓ ఇంట్లో పేకాడుతున్నారన్న సమాచారం మేరకు ఎస్‌వోటీ పోలీసులు దాడి చేశారు. ఈ తనఖీల్లి 8 మందిని అదుపులోకి తీసుకున్నారు. వారిని ఎస్ఆర్ నగర్ పోలీసులకు అప్పగించారు. ఈ మేరకు పోలీసులు కేసు దర్యాప్తు చేస్తున్నారు.

 

>
మరిన్ని వార్తలు