మిథున్రెడ్డిపై కేసు వెనుక రాజకీయ కుట్ర

1 Dec, 2015 13:29 IST|Sakshi

తిరుపతి: రాజంపేట ఎంపీ మిథున్రెడ్డి కేసు వెనుక రాజకీయ కుట్ర ఉందని వైఎస్ఆర్ సీపీ ఎమ్మెల్యేలు నారాయణ స్వామి, కొరముట్ల శ్రీనివాసులు ఆరోపించారు. మంగళవారం తిరుపతిలో వైఎస్ఆర్ సీపీ ఎమ్మెల్యేలు నారాయణ స్వామి, కొరముట్ల శ్రీనివాసులు మాట్లాడుతూ.. దురుద్దేశపూర్వకంగానే మిథున్రెడ్డిపై కేసు పెట్టారని విమర్శించారు.

ఎంపీకే రక్షణ లేకపోతే సామాన్యుడి పరిస్థితి ఏంటని వారు ఆందోళన వ్యక్తం చేశారు. ప్రధాని నరేంద్ర మోదీ జోక్యం చేసుకుని మిథున్రెడ్డిపై పెట్టిన కేసు ఉపసంహరించాలని వారు డిమాండ్ చేశారు.

మరిన్ని వార్తలు