రాష్ట్రపతిగా ప్రణబ్ @ మూడేళ్లు

25 Jul, 2015 01:12 IST|Sakshi
రాష్ట్రపతిగా ప్రణబ్ @ మూడేళ్లు

న్యూఢిల్లీ: రాష్ట్రపతిగా ప్రణబ్ ముఖర్జీ పదవీబాధ్యతలు చేపట్టి మూడు సంవత్సరాలు పూర్తయిన సందర్భాన్ని పురస్కరించుకుని శనివారం ఢిల్లీలోని రాష్ట్రపతిభవన్‌లో కేంద్రమంత్రులకు ఆయన విందు ఇవ్వనున్నారు. మంత్రులతోపాటు అతిథులు ఈ విందులో పాల్గొంటారని రాష్ట్రపతిభవన్ శుక్రవారం విడుదలచేసిన ఓ ప్రకటనలో తెలిపింది. వేర్వేరు సందర్భాల్లో రాష్ట్రపతిగా ప్రణబ్ చేసిన 154 ప్రసంగాలను పొందుపరిచిన రెండు సంపుటాలను, రాష్ట్రపతిభవన్ విశిష్టతను వివరించే రెండు పుస్తకాలను ఈ సందర్భంగా ఆవిష్కరిస్తారు. వీటిని ఉపరాష్ట్రపతి హమీద్ అన్సారీ, హోంమంత్రి రాజ్‌నాథ్ సింగ్ ఆవిష్కరిస్తారు. భారతదేశ 13వ రాష్ట్రపతిగా  2012, జులై 25వ తేదీన ప్రణబ్ ముఖర్జీ బాధ్యతలు స్వీకరించారు.

>
మరిన్ని వార్తలు