మూడు రోజుల్లో రెండోసారి: పురానాపూల్ లో రీ పోలింగ్

5 Feb, 2016 07:33 IST|Sakshi

హైదరాబాద్: మూడురోజుల వ్యవధిలోనే రెండోసారి ఓటేస్తున్నారు గ్రేటర్ లోని పురానాపూల్ డివిజన్ ఓటర్లు. ఫిబ్రవరి 2న జరిగిన ఎన్నికల్లో ఆ డివిజన్ లో ఎంఐఎం, కాంగ్రెస్ పార్టీ లమధ్య తలెత్తిన ఘర్షణల కారంణంగా మళ్లీ పోలింగ్ నిర్వహించాలని ఎన్నికల సంఘం భావించిన దరిమిలా శుక్రవారం ఉదయం 7 గంటల నుంచి రీపోలింగ్ ప్రారంభమైంది.

 

36 బూత్ లతో మొత్తం 34, 413 మంది ఓటర్లు తమ ఓటు హక్కును వినియోగించుకోనున్నారు. సాయంత్రం 5 గంటల వరకు పోలింగ్ జరుగుంది. మరోవైపు గ్రేటర్ ఎన్నికల ఓట్ల లెక్కింపు ప్రక్రియ శుక్రవారం మధ్యహ్నం 3 గంటల నుంచి ప్రారంభం కానుంది.

మరిన్ని వార్తలు