సెంట్రల్ జైలులో ఖైదీ మనస్తాపం : ఆత్మహత్య

28 Jan, 2016 12:44 IST|Sakshi
సెంట్రల్ జైలులో ఖైదీ మనస్తాపం : ఆత్మహత్య

విశాఖపట్నం : విశాఖపట్నం సెంట్రల్ జైలులో ఆత్మహత్యకు ప్రయత్నించిన రిమాండ్ ఖైదీ శ్రీనివాసరెడ్డి ఆసుపత్రిలో చికిత్స పొందుతూ గురువారం మరణించాడు. బాలికపై లైంగిక వేధింపుల కేసులో శ్రీనివాసరెడ్డిని ఇటీవల పోలీసులు అరెస్ట్ చేశారు. అయితే అతడు చేసుకున్న బెయిల అభ్యర్థనను కోర్టు తోసిపుచ్చింది. దీంతో శ్రీనివాసరెడ్డి తీవ్ర మనస్తాపం చెందాడు.

ఆ క్రమంలో జనవరి 26వ తేదీన సెంట్రల్ జైలులో శ్రీనివాసరెడ్డి యాసిడ్ తాగి ఆత్మహత్యాయత్నం చేసుకున్నాడు. దీంతో వెంటనే స్పందించిన జైలు సిబ్బంది.... అతడిని కేజీహెచ్కి తరలించారు. అతడు ఆసుపత్రిలో చికిత్స పొందుతూ ఈ రోజు మరణించాడు. శ్రీనివాసరెడ్డి విశాఖలోని అరిలోవలోని డ్రైవర్స్ కాలనీకి చెందిన వాడని పోలీసులు తెలిపారు.

మరిన్ని వార్తలు