'ఆన్‌లైన్ అప్‌లోడ్‌కు సిద్ధం కండి'

20 Nov, 2015 02:07 IST|Sakshi

సాక్షి, హైదరాబాద్: పదో తరగతి పరీక్ష ఫీజుకు సంబంధించి నామినల్ రోల్స్, ఐసీఆర్ కమ్ ఓఎంఆర్ ఫారాల డేటాను ఆన్‌లైన్లో అప్‌లోడ్ చేసేందుకు హెడ్‌మాస్టర్లు సిద్ధంగా ఉండాలని ప్రభుత్వ పరీక్షల విభాగం డెరైక్టర్ సురేందర్‌రెడ్డి గురువారం ఓ ప్రకటనలో సూచించారు.

ఆన్‌లైన్‌లో ఎప్పటి నుంచి అప్‌లోడ్ చేయాలన్న వివరాలను త్వరలోనే తెలియజేస్తామని, ఈలోగా ఫీజులు చెల్లించిన విద్యార్థుల సమగ్ర వివరాలను సిద్ధం చేసుకోవాలని పేర్కొన్నారు. కాగా, పదో తరగతి ఓంఎంఆర్, ఐసీఆర్ ఫారాలు డిసెంబరు 2 వరకు అందజేసేందుకు అవకాశం ఇస్తామని ఆయన హామీ ఇచ్చినట్లు ఎస్టీయూ-టీఎస్ నేతలు రాజిరెడ్డి, భుజంగరావు ఓ ప్రకటనలో తెలిపారు.
 

మరిన్ని వార్తలు