తల్లిదండ్రుల విభేదాలు: కూతురు ఆత్మహత్య

20 Dec, 2015 16:34 IST|Sakshi

కారేపల్లి (ఖమ్మం) : తల్లిదండ్రుల మధ్య విభేదాలు ఓ యువతిని ఆత్మహత్యవైపు పురిగొల్పాయి. ఖమ్మం జిల్లా కారేపల్లి మండలం చింతలతండాకు చెందిన శైలజ (17) ఆదివారం రైలు కిందపడి ఆత్మహత్య చేసుకుంది. తల్లిదండ్రులు చీటికీ మాటికీ గొడవలు పడుతుండడంతో మనస్తాపానికి గురైన ఆమె ఈ పనికి పాల్పడినట్టు పోలీసులు తెలిపారు. ఏడవ తరగతి వరకు చదివిన శైలజ కూలి పనులకు వెళుతూ కుటుంబానికి ఆసరాగా ఉంటోంది.

మరిన్ని వార్తలు