అన్నదాత ఆత్మహత్య

1 Mar, 2016 19:45 IST|Sakshi

నల్లగొండ జిల్లా పెద్ద అడిశర్లపల్లి మండలం నంబాపురం గ్రామ పంచాయతీ పరిధి బూడిదగట్టు గ్రామంలో ఓ రైతు ఆత్మహత్యకు పాల్పడ్డాడు. దేపావత్ పాండునాయక్(40) వ్యవసాయం చేసుకుంటూ జీవనం సాగిస్తున్నాడు. పత్తి సాగు కోసం, కుటుంబ అవసరాల కోసం మొత్తం రూ.4లక్షలు అప్పు చేశాడు. వర్షాభావ పరిస్థితులకు దిగుబడి రాకపోవడంతో మనస్తాపానికి గురయ్యాడు. దీంతో సోమవారం రాత్రి ఉంట్లోనే పురుగుల మందు తాగి బలవన్మరణానికి పాల్పడ్డాడు.

 

మరిన్ని వార్తలు