నేడు ఎయిమ్స్‌కు శంకుస్థాపన

19 Dec, 2015 03:21 IST|Sakshi

హాజరవనున్న కేంద్ర మంత్రులు, సీఎం చంద్రబాబు

 సాక్షి, విజయవాడ బ్యూరో: గుంటూరు జిల్లా మంగళగిరిలో నిర్మించే ఆలిండియా ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సెన్సైస్(ఎయిమ్స్) నిర్మాణ పనులకు శనివారం ఉదయం శంకుస్థాపన జరగనుంది. కేంద్ర వైద్య ఆరోగ్య శాఖ మంత్రి జగత్ ప్రకాశ్ నడ్డా, పట్టణాభివృద్ధి శాఖ మంత్రి వెంకయ్య, సీఎం చంద్రబాబు ముఖ్య అతిథులుగా శంకుస్థాపనకు హాజరవుతున్నారు. ఉదయం 11 గంటలకు జరిగే ఈ కార్యక్రమానికి జిల్లా అధికారులు ఏర్పాట్లన్నీ పూర్తి చేశారు. మూడేళ్లలో పనులు పూర్తయ్యేలా చర్యలు తీసుకుంటున్నామని రాష్ట్ర వైద్య, ఆరోగ్య శాఖ మంత్రి కామినేని శ్రీనివాస్ చెప్పారు.

మరిన్ని వార్తలు