టుడే న్యూస్ అప్డేట్స్

3 Nov, 2015 07:07 IST|Sakshi

కాంగ్రెస్ నిరసన ర్యాలీ: దేశంలో నెలకొన్న అసహన పరిస్థితులపై కేంద్ర ప్రభుత్వం మౌనం వహించడాన్ని నిరసిస్తూ కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో నేడు పార్లమెంట్ భవనం నుంచి రాష్ట్రపతి భవన్ వరకు ర్యాలీ నిర్వహించనున్నారు. ఆ పార్టీ అధినేత్రి సోనియాగాంధీ, జాతీయ ఉపాధ్యక్షుడు రాహుల్ గాంధీ, పలువురు కీలక నేతలు, కార్యకర్తలు ఈ కార్యక్రమంలో పాల్గొననున్నారు.

బాబు ఢిల్లీ పర్యటన: ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు నేడు ఢిల్లీకి వెళ్లనున్నారు.

 

సొంత నియోజకవర్గంలో కేటీఆర్: పంచాయతీరాజ్, ఐటీ శాఖ మంత్రి కేటీఆర్ నేడు తన సొంత నియోజకవర్గం సిరిసిల్లలో పర్యటించనున్నారు. వాటర్ గ్రిడ్ పథకంపై సమీక్ష నిర్వహించడంతోపాటు పలు అభివృద్ధి పనులకు శంకుస్థాపన చేస్తారు.

అయ్యన్న విశాఖ పర్యటన: ఏపీ మంత్రి అయ్యన్నపాత్రుడు నేడు విశాఖపట్టణం జిల్లాలో పర్యటించనున్నారు. ఈ సందర్భంగా పలు అభివృద్ధి కార్యక్రమాలను ఆయన ప్రారంభిస్తారు.

మరిన్ని వార్తలు