ఆటో నుంచి జారిపడి గిరిజనుడి మృతి

10 Feb, 2016 13:51 IST|Sakshi

పాడేరు మండలంలోని కొత్తపొలం గ్రామం వద్ద ప్రమాదవశాత్తూ ఆటోలో నుంచి జారిపడి మర్రి రామారావు(40) అనే గిరిజనుడు మృతిచెందాడు. కొత్తపొలం గ్రామం నుంచి సొంతూరు ముంతమామిడి గ్రామానికి ఆటోలో వెళ్తుండగా ఈ సంఘటన జరిగింది. ఈ సంఘటనపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.

 

మరిన్ని వార్తలు