ఉపరాష్ట్రపతికి ఘనస్వాగతం

26 Aug, 2017 12:24 IST|Sakshi
ఉపరాష్ట్రపతికి ఘనస్వాగతం
విజయవాడ: ఉపరాష్ట్రపతి ఎం. వెంకయ్యనాయుడు నేడు స్వరాష్ట్రానికి వచ్చారు. పదవి బాధ్యతలు చేపట్టిన అనంతరం తొలిసారి వచ్చిన వెంకయ్యనాయుడుకు గన్నవరం విమానాశ్రయంలో ఘనస్వాగతం పలికారు. గవర్నర్‌ నరసిహాన్‌, ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు, కేంద్ర మంత్రులు, రాష్ట్ర మంత్రులు, నాయకులు ఆయనకు స్వాగతం పలికారు. అక్కడి నుంచి ప్రత్యేక వాహనంలో ఉపరాష్ట్రపతి, గవర్నర్‌, సీఎం చంద్రబాబు ప్రజలకు అభివాదం చేస్తూ ముందుకు కదిలారు.
మరిన్ని వార్తలు