-

మత్య్సకారులకు వాతావరణ శాఖ హెచ్చరిక

20 Nov, 2015 14:08 IST|Sakshi

విశాఖ: ఆంధ్రప్రదేశ్ లో ఈశాన్య రుతుపవనాలు బలంగా వీస్తున్నాయని విశాఖ వాతావరణ కేంద్రం తెలిపింది. మరో రెండు రోజుల పాటు కోస్తాంధ్రకు గాలుల ప్రభావం ఉంటుందని పేర్కొంది. గంటకు 45 నుంచి 50 కిలోమీటర్ల వేగంతో గాలులు వీచే అవకాశం ఉందని తెలిపింది. మత్య్స కారులు అప్రమత్తంగా ఉండాలని వాతావరణ శాఖ హెచ్చరించింది.

మరిన్ని వార్తలు