'తమిళనాడు ప్రభుత్వం ఆ జీవోను రద్దు చేయాలి'

3 Dec, 2015 12:13 IST|Sakshi

ఢిల్లీ: విద్యార్థులు తమిళంలోనే పరీక్షలు రాయాలని తమిళనాడు ప్రభుత్వం జీవో జారీ చేయడాన్ని మాజీ పార్లమెంట్ సభ్యులు యార్లగడ్డ లక్ష్మీ ప్రసాద్ తప్పుపట్టారు. తమిళనాడు ప్రభుత్వం తీసుకున్న ఈ నిర్ణయం వలన ఇతర భాషల విద్యార్థులు తీవ్రంగా నష్టపోతారని ఆయన తెలిపారు. ప్రభుత్వం జారీ చేసిన జీవోను వెంటనే రద్దు చేయాలని కోరిన ఆయన దీనిపై ఈ నెల 23న జంతర్మంతర్ వద్ద ధర్నా చేపట్టనున్నట్లు తెలిపారు.
 

>
మరిన్ని వార్తలు