సాక్షి, హైదరాబాద్: లిఫ్టు పనిచేయక అందులో ఇరుక్కొని ఒకరు మృతి చెందిన ఘటన నగరంలో చోటు చేసుకుంది. హిమాయత్నగర్లోని ఏఐటీయూసీ కార్యాలయ భవనంలో ఈ ప్రమాదం జరిగింది. యునైటెడ్ ఇండియా ఇన్సూరెన్స్ కంపెనీ కార్యాలయం ఈ భవనంలో నడుస్తోంది. ఈ సంస్థ ఉద్యోగి ఆనందరావు(56) మంగళవారం సాయంత్రం లిఫ్టులో ఇరుక్కొని చనిపోయాడు. ఆయన స్వస్థలం గుంటూరు జిల్లా నరసరావుపేట కాగా, ఉద్యోగ రీత్యా సనత్నగర్లో ఉంటున్నారు.