'మీరిలా చేస్తే తప్పుడు సంకేతాలు వెళతాయి'

29 Mar, 2016 10:55 IST|Sakshi

హైదరాబాద్: అంబేద్కర్ ఓపెన్ వర్సిటీ చట్ట సవరణ బిల్లు తెలంగాణ డిప్యూటీ సీఎం కడియం శ్రీహరి శాసన సభలో ప్రవేశ పెట్టారు. ఈ సందర్భంగా చాలా రాష్ట్రాల్లో వైస్ ఛాన్సలర్లను రాష్ట్ర ప్రభుత్వాలే నియమిస్తున్నాయని చెప్పారు.

కాగా, ఈ బిల్లుపై ప్రతిపక్షాల సభ్యులు మాట్లాడుతూ దీనిపై పునరాలోచన చేయాలని అన్నారు. పార్టీలకు అతీతంగా ప్రభుత్వాలు జోక్యం చేసుకోకుండా యూనివర్సిటీలను చక్కబెట్టాల్సిన అవసరం ఉందని చెప్పారు. వైఎస్ ఛాన్సలర్లును ప్రభుత్వమే నియమిస్తే తప్పుడు సంకేతాలు వెళతాయని పలువురు అన్నారు.

>
మరిన్ని వార్తలు