అరికాళ్లలో కిలో బంగారం

31 Jan, 2017 16:03 IST|Sakshi
హైదరాబాద్‌: శంషాబాద్‌ విమానాశ్రయంలో మరోసారి అక్రమంగా తరలిస్తున్న బంగారం పట్టుబడింది. మంగళవారం ఉదయం సౌదీ అరేబియా జెడ్డా నుంచి వచ్చిన ఇద్దరి ప్రయాణికులను కస్టమ్స్‌  అధికారులు తనిఖీ చేశారు. ఈ సందర్భంగా అరికాళ్ల కింద బంగారాన్ని దాచి తరలిస్తుండగా పట్టుబడ్డారు. ఈ మేరకు అతడిని అదుపులోకి తీసుకుని ప్రశ్నిస్తున్నారు. 
మరిన్ని వార్తలు