సర్కారు నిర్ణయం... జీతాల పెంపు కూడా
సాక్షి, హైదరాబాద్: జీవీకే-ఈఎంఆర్ఐ సంస్థలో ‘108’ అత్యవసర సర్వీసులో పనిచేసి తొలగింపునకు గురైన ఉద్యోగులను తిరిగి విధుల్లోకి తీసుకోవాలని ప్రభుత్వం నిర్ణయించింది. ఈ మేరకు బుధవారం మంత్రులు కె.తారకరామారావు, లక్ష్మారెడ్డి ‘108’ సేవలను బలోపేతం చేయడానికి సంబంధించి సమావేశం నిర్వహించారు. ఇందులో జీవీకే-ఈఎంఆర్ఐ సంస్థ ప్రతినిధులు కూడా హాజరయ్యారు. అలాగే ‘108’లో పనిచేసే ఉద్యోగుల వేతనాలను పెంచాలని కూడా నిర్ణయించింది.