ఆహార భద్రత విభాగంలో 130 కొత్త పోస్టులు

9 Feb, 2016 04:33 IST|Sakshi

సాక్షి, హైదరాబాద్: రాష్ట్రంలో ఆహార కల్తీని నివారించడం, ఎక్కడికక్కడ ఆహార పదార్థాల నాణ్యతపై తనిఖీలు నిర్వహించడం కోసం కొత్తగా 130 పోస్టులను మంజూరు చేయాలని వైద్య ఆరోగ్య శాఖ నిర్ణయించింది. ఫుడ్ ఇన్‌స్పెక్టర్లు, అసిస్టెంట్ ఫుడ్ ఇన్‌స్పెక్టర్లు, ల్యాబ్ టెక్నీషియన్లు తదితర పోస్టులు ఇందులో ఉన్నట్లు తెలిసింది. దీనికి సంబంధించిన ఫైలును ఆ శాఖ ఇప్పటికే రూపొందించింది. త్వరలోనే సీఎం ఆమోదానికి పంపనున్నారు. సీఎం ఆమోదించాక పోస్టుల భర్తీ ప్రక్రియ చేపడతారు.

>
మరిన్ని వార్తలు