హైదరాబాద్: నగరంలోని రాజేంద్రనగర్ పోలీస్స్టేషన్ పరిధిలో బైక్ రేసింగ్లతో కుర్రాళ్లు రెచ్చిపోయారు. మితిమీరిన వేగంతో వాహనాలు నడుపుతూ తోటి ప్రయాణికులను భయబ్రాంతులకు గురిచేశారు. రేసింగ్లకు పాల్పడుతున్న 14 మందిని పోలీసులు అరెస్ట్ చేసి వారి బైక్స్ స్వాధీనం చేసుకున్నట్లు తెలిపారు. అరెస్ట్ చేసిన వారిలో కొందరు మైనర్లు కూడా ఉన్నట్లు సమాచారం.