ఇద్దరు మావోయిస్టుల లొంగుబాటు

23 Sep, 2015 17:34 IST|Sakshi

హైదరాబాద్: ప్లాటూన్ నెంబర్ 26 క్రియాశీల పాత్ర పోషించిన ఇద్దరు మావోయిస్టులు పోలీసుల ఎదుట లొంగిపోయారు. బుధవారం సీఆర్పీఎఫ్ డీఐజీ, సుకుమా జిల్లా కలెక్టర్, జిల్లా ఎస్పీల సమక్షంలో ఇద్దరు మావోలు లోంగిపోయారు. లొంగిపోయిన వారిలో అశోక్ తాతి అలియాస్ రోషన్ పేరిట రూ. 2 లక్షల రివార్డ్ ఉండగా.. మరో మావో సుశిల్ కోర్సా అలియాస్ దేవ పేరిట రూ. లక్ష రివార్డ్ ఉన్నట్లు సీఆర్పీఎఫ్ డీఐజీ తెలిపారు. వీరిద్దరు పలు విద్రోహ చర్లల లో పాల్గొన్నట్లు ఆయన తెలిపారు.

మరిన్ని వార్తలు