హైదరాబాద్: నగరంలో అప్పుడే క్రికెట్ ప్రపంచ కప్ ఫీవర్ వచ్చేసింది. త్వరలో జరిగే వన్డే ప్రపంచ కప్ నమూనాను ఆవిష్కరించారు. బుధవారం హైదరాబాద్లోని ఇనార్బిట్మాల్లో జరిగిన ఓ కార్యక్రమంలో ప్రపంచ కప్ నమానాను ప్రదర్శించారు. పెద్దలతో పాటు చిన్నారులు కూడా ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. గత ప్రపంచ కప్ ను ధోనీ సారథ్యంలోని భారత్ కైవసం చేసుకున్న సంగతి తెలిసిందే.
2015 ప్రపంచ కప్నకు ఆస్ట్రేలియా, న్యూజిలాండ్ ఆతిథ్యమివ్వనున్నాయి. ఈ మెగా ఈవెంట్ కోసం టీమిండియా ఇప్పటి నుంచే సన్నద్ధమవుతోంది. భారత జట్టు ప్రస్తుతం ఆస్ట్రేలియా పర్యటనలో ఉంది. ఈసారి కూడా టీమిండియాపై భారీ అంచనాలున్నాయి.