వడదెబ్బతో 23 మంది మృతి

10 Apr, 2016 04:52 IST|Sakshi

సాక్షి, నెట్‌వర్క్: వడదెబ్బతో శనివారం వివిధ జిల్లాల్లో 23 మంది మృతి చెందారు. మృతుల్లో నల్లగొండ జిల్లా చిలుకూరు మండల కేంద్రంలోని హరిజనవాడకు చెందిన కె.తిరపయ్య (65), నూకపంగు బుచ్చయ్య (55), కోదాడ మండల పరిధిలోని కొమరబండకు చెందిన మాదాసు ప్రసాద్ (26), ఆలేరులో తాపీ మేస్త్రీ పాశికంటి దామోదర్ (50), వేములపల్లి మండలం కల్వలపాలెంలో వివాహిత నోముల శైలజ (25), మిర్యాలగూడ పట్టణంలోని హైమద్‌పూరకు చెందిన పిట్టల ఆనంద్(48), చిట్యాల మండలంలోని చిన్నకాపర్తికి చెందిన దేశపాక జానయ్య (31), ఖమ్మం జిల్లా ముదిగొండ మండలం గంధసిరి గ్రామానికి చెందిన షేక్ బడేసాహెబ్ (60), తిరుమలాయపాలెం మండల కేంద్రానికి చెందిన గోకినపల్లి రామయ్య (60), కొణిజర్ల మండలం చినమునగాలకు చెందిన ఇల్లందుల చినయలమంద (70), మహబూబ్‌నగర్ జిల్లా మూసాపేటకు చెందిన తాపీ మేస్త్రీ  బోయ తిరుపతయ్య(40), మాగనూర్ మండలం గుడెబల్లూర్‌కు చెందిన జెగ్గిలి చిన్నన్న(50), వరంగల్ జిల్లా కురవికి చెందిన తేనె వెంకన్న (38), కురవి మండలం సూదనపల్లికి చెందిన అచ్చినపల్లి చంద్రమ్మ (70), పరకాల మండలం మాదారానికి చెందిన పసుల సమ్మయ్య(60), అదే మండలం నాగారానికి చెందిన కూలి పసుల రమ(26), నర్సంపేటకు చెందిన పొనుగోటి వీరమ్మ(78), చెన్నారావుపేట మండలం ముగ్ధుంపురకు చెందిన డప్పు కళాకారుడు సూరయ్య(55), కరీంగనగర్ జిల్లా పెద్దపల్లి మండలం సబ్బితానికి చెందిన సలేంద్ర లచ్చమ్మ(62), మహదేవపూర్‌కు చెందిన తరుకచ్చి రఘునాథస్వామి(80), హుజూరాబాద్ మండలం సింగాపురానికి చెందిన పాయిరాల కొండెల్లయ్య(40), భీమదేవరపల్లి మండలం కొత్తపలివాసి రేణుకుంట్ల స్వరూప(26), కొడిమ్యాలకు చంఎదిన చొక్కాల దేవయ్య(70) ఉన్నారు.

మరిన్ని వార్తలు