జియాగూడలో భారీగా రేషన్ బియ్యం పట్టివేత

26 Feb, 2016 17:35 IST|Sakshi

హైదరాబాద్ : నగరంలోని జియాగూడలో ఓ ఇంట్లో సౌత్ జోన్ పోలీసులు శుక్రవారం తనిఖీలు నిర్వహించారు. ఈ సందర్భంగా 290 బస్తాల రేషన్ బియ్యం పట్టుకున్నారు. వాటిని స్వాధీనం చేసుకుని... సీజ్ చేశారు. అందుకు సంబంధించి నలుగురు వ్యక్తులను అరెస్ట్ చేశారు. వారిని పోలీస్ స్టేషన్కు తరలించారు. వారిపై కేసు నమోదు చేసి విచారిస్తున్నారు.
 

మరిన్ని వార్తలు