హైదరాబాద్: తెలంగాణ ఆర్టీసీ కార్మికులకు 3.4 శాతం డీఏ అమలు కానుంది. ఈ మేరకు మంగళవారం ఉత్తర్వులు జారీ అయ్యాయి. ఆర్టీసీ కార్మికులకు డీఏ అమలు చేస్తూ ఉత్తర్వులు జారీ కావడంపై తెలంగాణ ఆర్టీసీ యాజమాన్యానికి టీఎమ్యూ నేత థామస్రెడ్డి కృతజ్ఞతలు తెలిపారు.