ఒకటి కాదు.. మూడు బుల్లెట్లు

25 Aug, 2014 02:28 IST|Sakshi

 మణికొండలో మరింత కలకలం
 
 హైదరాబాద్: రాయదుర్గం పోలీసుస్టేషన్ పరిధిలోని మణికొండలో కలకలం రేపిన బుల్లెట్ ఉదంతంలో ఆదివారం మరో బుల్లెట్ లభ్యమైంది. దీంతో మొత్తం మూడు బుల్లెట్లు ఆ ప్రాంతంలోకి దూసుకు వచ్చినట్లు పోలీసులు నిర్ధారించారు. ఒక బుల్లెట్ శ్రీనివాసాచారి చేతిలోకి దూసుకుపోగా మరో రెండు బుల్లెట్లు ఘటనాస్థలి సమీపంలో దొరికాయి. ఈ మూడు బుల్లెట్లను కూడా పరీక్షల నిమిత్తం పోలీసులు ఫోరెన్సిక్ సైన్స్ ల్యాబ్‌కు తరలించారు. సమీపంలోని మిలటరీ ఫైరింగ్ రేంజి నుంచి ఈ బుల్లెట్లు వచ్చాయని పోలీసులు, స్థానికులు అనుమానిస్తుండగా.. అవి తమవి కావని, మిలటరీ అధికారులు ఘటనా స్థలాన్ని సందర్శించి నిర్ధారించారు.
 

మరిన్ని వార్తలు