బ్యానర్లు కడుతుండగా కరెంట్‌ షాక్‌

6 Apr, 2017 15:02 IST|Sakshi
హైదరాబాద్‌: ఓ సెల్‌ఫోన్‌ కంపెనీ ప్రచారం కోసం బ్యానర్లు కడుతుండగా విద్యుత్‌ షాక్‌ తగిలి ముగ్గురు యువకులు తీవ్రంగా గాయపడ్డారు. గురువారం మధ్యాహ్నం జీడిమెట్ల షాపూర్‌నగర్‌లో ఈ ఘటన చోటు చేసుకుంది. స్థానికంగా ఓ సెల్‌ఫోన్‌ విక్రయ సంస్థ ప్రచారం కోసం కరెంటు స్తంభాలకు బ్యానర్లు, జెండాలు కడుతున్నారు. అయితే, ఓ స్తంభం వద్ద ప్రమాదవశాత్తు తీగలు తాకటంతో అక్బర్‌, ఇంతియాజ్‌, ఇమ్రాన్‌ అనే యువకులు తీవ్రంగా గాయపడ్డారు. క్షతగాత్రులను వెంటనే ఆస్పత్రికి తరలించారు. వారి పరిస్థితి విషమంగా ఉన్నట్లు సమాచారం. ఈ మేరకు పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు ప్రారంభించారు.
>
మరిన్ని వార్తలు