బస్ స్టాప్‌లోకి దూసుకెళ్లిన లారీ

1 May, 2016 12:41 IST|Sakshi

హైదరాబాద్ : వనస్థలిపురం పనామా దగ్గర ఆదివారం మధ్యాహ్నం ఓ ఇసుక లారీ, కారు ఢీకొన్నాయి. ఈ ప్రమాదంలో నలుగురికి గాయాలు కాగా, వారిలో ఇద్దరికి తీవ్ర గాయాలయ్యాయి. లారీ అదుపుతప్పి పక్కనే ఉన్న బస్టాప్‌లోకి దూసుకెళ్లింది. అదృష్టవశాత్తూ ఆ సమయంలో బస్టాప్‌లో ఎవరూ లేకపోవడంతో పెద్ద ప్రమాదం తప్పింది. క్షతగాత్రులను ఆస్పత్రికి తరలించారు. ఈ ఘటనతో ఆ ప్రాంతంలో ట్రాఫిక్ జామ్ నెలకొంది.

మరిన్ని వార్తలు