గ్రూప్‌–2లో ‘డా.లక్ష్మయ్య’ విద్యార్థుల సత్తా

9 Apr, 2017 02:30 IST|Sakshi

సాక్షి, హైదరాబాద్‌: ఆంధ్రప్రదేశ్‌ గ్రూప్‌–2 ప్రిలిమినరీ పరీక్షలో తమ స్టడీ సర్కిల్‌కు చెందిన 415 మంది విద్యార్థులు ఉత్తీర్ణత సాధించినట్లు డాక్టర్‌ లక్ష్మయ్య ఐఏఎస్‌ స్టడీ సర్కిల్‌ డైరెక్టర్‌ పి.పద్మజారాణి శనివారం ఓ ప్రకటనలో తెలిపారు. ఆంధ్రప్రదేశ్‌ స్కిల్‌ డెవలప్‌మెంట్‌ ఆధ్వర్యంలో తమ స్టడీ సర్కిల్‌ సహకారంతో విద్యార్థులను ఆన్‌లైన్‌ పరీక్ష ద్వారా ఎంపిక చేసి, వారికి ఉచితంగా శిక్షణ ఇచ్చినట్లు చెప్పారు. వారిలో కూడా దాదాపు వెయ్యి మంది మెయిన్స్‌కు అర్హత సాధించారని, వీరందరికీ హైదరాబాద్‌లో మెయిన్స్‌కు ప్రత్యేక శిక్షణ ఇస్తున్నామని వెల్లడించారు. ప్రిలిమినరీ పరీక్షలో ఉత్తీర్ణత సాధించిన విద్యార్థులను సంస్థ చైర్మన్‌ డాక్టర్‌ లక్ష్మయ్య సన్మానించినట్లు తెలిపారు.

మరిన్ని వార్తలు