లంగర్‌హౌజ్‌ ఘటనలో ఐదుగురి అరెస్ట్‌

16 Jan, 2017 14:19 IST|Sakshi
హైదరాబాద్‌: లంగర్‌ హౌజ్‌లో మందుబాబుల దాడి కేసులో పోలీసులు ఐదుగురు నిందితులను అరెస్ట్‌ చేశారు. లంగర్‌ హౌజ్‌ కూడలిలోని ఆనంద్‌ వైన్స్‌ మందు మాణిక్‌చంద్‌ యాదవ్‌ అనే యువకుడు ద్విచక్రవాహనం పార్క్‌ చేసి ఉండగా.. దాని పై కొందరు మందుబాబులు మద్యం సేవిస్తూ కూర్చున్నారు.  ఆ యువకుడు బండి పై నుంచి లేవమని అనడంతో.. కోపోద్రిక్తులైన వారు యువకుడిపై విచక్షణ రహితంగా దాడి చేసి తీవ్రంగా కొట్టారు.  ఈ అంశంపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు సీసీ టీవీ ఫుటేజి ఆధారంగా కేసు దర్యాప్తు చేసి సోమవారం ఐదుగురు నిందితులను అరెస్ట్‌ చేశారు. 
మరిన్ని వార్తలు