ఈవ్ టీజింగ్కు పాల్పడుతున్న 50మంది అరెస్ట్

29 Nov, 2013 09:32 IST|Sakshi

సికింద్రాబాద్ : సికింద్రాబాద్ రైల్వే స్టేషన్లో ఆర్పీఎఫ్ శుక్రవారం స్పెషల్ డ్రైవ్ నిర్వహించింది. ఈ సందర్బంగా మహిళా బోగీల్లో ఈవ్ టీజింగ్కు పాల్పడుతున్న 50మందిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. వారిపై కేసు నమోదు చేసి కోర్టులో హాజరు పరచనున్నారు.  లోకల్ రైళ్లలో ప్రయాణించే మహిళలకు భద్రత కరువైంది.

వారికి ప్రత్యేకంగా కేటాయించిన బోగీలలోనూ పురుషులు ఎక్కి దురుసుగా వ్యవహరిస్తున్నారన్న ఫిర్యాదులు వస్తున్న నేపథ్యంలో పోలీసులు ఈ డ్రైవ్ చేపట్టారు. కాగా తమకు కేటాయించిన ప్రత్యేక బోగీలలో పోలీసులు అందుబాటులో లేకపోవడంతో అత్యవసర సమయాలలో తాము ఎవరికి ఫిర్యాదు చేయాలని మహిళా ప్రయాణికులు ప్రశ్నిస్తున్నారు.

మరిన్ని వార్తలు