హైదరాబాద్: నగరంలోని హైటెక్స్లో శనివారం ఉదయం నిర్వహించిన ‘5కే ఫన్ రన్’ ఔత్సాహికులను విశేషంగా ఆకట్టుకుంది. ఆదివారం పీపుల్స్ ప్లాజా వద్ద జరగనున్న ఎయిర్టెల్ హైదరాబాద్ మారథాన్-2017 కార్యక్రమానికి సన్నాహకంగా నిర్వహించిన ఈ ఫన్ రన్ను ఐటీ శాఖ ప్రధాన కార్యదర్శి జయేష్ రంజన్ ప్రారంభించారు. హైటెక్స్ నుంచి నోవాటెల్ వరకు సాగిన ఈ రన్లో సుమారు 6 వేల మందికి పైగా పాల్గొన్నారు.
ఈ కార్యక్రమంలో చిన్నారులు అధిక సంఖ్యలో పాల్గొని సందడి చేశారు. ఆదివారం ఎయిర్టెల్ హైదరాబాద్ మారథాన్ ఆధ్వర్యంలో వరుసగా ఏడోసారి ఫుల్ మారథాన్, హాఫ్ మారథాన్లు నిర్వహంచనున్నారు. ఆరోగ్యం-పరుగు ప్రాముఖ్యతను చాటుతూ సాగే ఈ మారథాన్లో నగరవాసులు భారీ సంఖ్యలో పాల్గొనే అవకాశం ఉందని నిర్వాహకులు వెల్లడించారు.