గ్రూప్-2 పరీక్షకు 6.5 లక్షల మంది దరఖాస్తు

20 Dec, 2016 19:09 IST|Sakshi
గ్రూప్-2 పరీక్షకు 6.5 లక్షల మంది దరఖాస్తు

 అత్యధికంగా విశాఖ నుంచి 74,369 దరఖాస్తులు
హైదరాబాద్:
ఆంధ్రప్రదేశ్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ రాష్ట్రంలోని 982 గ్రూప్-2 పోస్టుల భర్తీకి జారీచేసిన నోటిఫికేషన్‌కు కమిషన్ ఆశించిన స్థాయిలోనే దరఖాస్తులు అందాయి. ఆదివారం అర్థరాత్రితో గడువు ముగిసే సమయానికి ఈ పోస్టులకు 6,55,729 మంది ఆన్‌లైన్ దరఖాస్తు చేసుకున్నారు.

ఆన్‌లైన్ పేమెంట్‌కు సంబంధించి బ్యాంకుల నుంచి సమాచారం వస్తే ఈ సంఖ్య మరో వెయ్యి వరకూ పెరుగుతుందని ఏపీపీఎస్సీ వర్గాలు తెలిపాయి. ఇందులో హైదరాబాద్ నుంచి 52,893 మంది అభ్యర్థులు దరఖాస్తు చేశారు. వీరంతా నాన్‌ లోకల్ కేటగిరీలో అప్లై చేసుకున్నారు. ఆంధ్రప్రదేశ్‌లోని 13 జిల్లాల నుంచి వచ్చిన ఆన్‌లైన్ దరఖాస్తుల పరిస్థితిని పరిశీలిస్తే విశాఖపట్టణం జిల్లాలో అత్యధిక శాతం మంది ఈ పరీక్షలకు పోటీపడుతున్నారు. విశాఖపట్టణం నుంచి అత్యధికంగా 74,369 మంది దరఖాస్తు చేశారు.

>
మరిన్ని వార్తలు