కేసీఆర్ కుటుంబానికి 6 శాతం ముడుపులు

20 Feb, 2016 03:18 IST|Sakshi
కేసీఆర్ కుటుంబానికి 6 శాతం ముడుపులు

టీపీసీసీ చీఫ్ ఉత్తమ్ ఆరోపణ
 సాక్షి, హైదరాబాద్: రాష్ట్రంలో మిషన్ భగీరథ పథకం సహా నీటిపారుదల ప్రాజెక్టుల్లో భారీగా అవినీతి జరుగుతోందని.. ఇది దేశంలోనే అతిపెద్ద కుంభకోణమని టీపీసీసీ అధ్యక్షుడు ఉత్తమ్‌కుమార్‌రెడ్డి ఆరోపించారు. శుక్రవారం ఆయన మాట్లాడుతూ కొన్ని కంపెనీలకు కాంట్రాక్టు పనులను కట్టబెట్టడానికి ప్రభుత్వం నిబంధనలు, మార్గదర్శకాలను మార్చడం వెనుక భారీగా ముడుపుల వ్యవహారం దాగుందన్నారు. సీఎం కేసీఆర్, ఆయన కుటుంబ సభ్యులకు సన్నిహిత సంబంధాలున్న కాంట్రాక్టు సంస్థలకు పనులను అప్పగించడం ద్వారా ముడుపులు తీసుకోవడానికి ఇలాంటి చర్యలకు ప్రభుత్వం దిగిందని.. సీఎం కుటుంబ సభ్యులకు ఈ పనుల మొత్తంలో 6 శాతం ముడుపులు అందుతున్నాయని ఆరోపించారు.

>
మరిన్ని వార్తలు