60 సీట్లకు కుదిరిన అవగాహన

12 Jan, 2016 02:21 IST|Sakshi
60 సీట్లకు కుదిరిన అవగాహన

వామపక్ష కూటమి వెల్లడి.. 13న అభ్యర్థుల ప్రకటన

 సాక్షి, హైదరాబాద్: జీహెచ్‌ఎంసీ ఎన్నికల్లో పోటీపై వామపక్ష కూటమికి సంబంధించి 60 సీట్లకు అంగీకారం కుదిరిందని, 13న అభ్యర్థులను ప్రకటిస్తామని సీపీఎం రాష్ట్ర కార్యద ర్శివర్గ సభ్యుడు డీజీ నర్సింహారావు తెలిపారు. ఈ కూటమిలో సీపీఐ, సీపీఎం, లోక్‌సత్తా, ఎంసీపీఐ, ఆప్, ఎంబీసీ జేఏసీలు భాగంగా ఉన్నాయన్నారు. సోమవారమిక్కడ ఆయన విలేకరులతో మాట్లాడుతూ, ఈ ఎన్నికల్లో ఆప్ పోటీచేయడం లేదని, వామపక్ష కూటమికి మద్దతు తెలిపిందన్నారు. ప్రస్తుతం కుదిరిన అవగాహనలో సీపీఎం 25 సీట్లలో, లోక్‌సత్తా 21, సీపీఐ 12, ఎంసీపీఐ ఒక సీటుకు పోటీచేయనున్నట్లు చెప్పారు.

ఈ నెల 13న జరిగే సమావేశంలో తమ్మినేని వీరభద్రం (సీపీఎం), చాడ వెంకటరెడ్డి (సీపీఐ), జేపీ(లోక్‌సత్తా), ఎండీ గౌస్(ఎంసీపీఐ) తదితరులు అన్ని డివి జన్లలో పోటీకి సంబంధించి వ్యూహాన్ని, సీట్ల సర్దుబాటును ఖరారు చే స్తారన్నారు.

>
మరిన్ని వార్తలు