యువకుడు వేధింపులు... విద్యార్థిని ఆత్మహత్యాయత్నం

27 Apr, 2014 10:40 IST|Sakshi
యువకుడు వేధింపులు... విద్యార్థిని ఆత్మహత్యాయత్నం

హైదరాబాద్ పాతబస్తీలోని చాంద్రయణగుట్ట పీఎస్ పరిధిలో ఆదివారం దారుణం చోటు చేసుకుంది. ప్రేమించమంటూ యువకుడు వేధింపులు తాళలేక ఓ విద్యార్థిని ఒంటిపై కిరోసిన్ పోసుకుని ఆత్మహత్యకు యత్నించింది. కుటుంబ సభ్యులు వెంటనే స్పందించి ఆ బాలికను ఆసుపత్రికి తరలించారు. బాలిక పరిస్థితి విషమంగా ఉందని వైద్యులు వెల్లడించారు. ఆ ఘటనతో నిందితునిపై పోలీసులు నిర్భయ చట్టం కింద కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. అయితే నిందితుడు పరారీలో ఉన్నాడని... అతడి కోసం గాలింపు చర్యలు చేపట్టినట్లు పోలీసులు వెల్లడించారు.

 

పోలీసులు కథనం ప్రకారం... బాధితురాలు స్థానికంగా ఉన్న పాఠశాలలో 8వ తరగతి చదువుతుంది. ఆ విద్యార్థిని పాఠశాలకు వెళ్లి వచ్చే సమయంలో ఓ యువకుడు ప్రేమిస్తున్నానంటూ వెనక పడుతూ తరచు వేధింపులకు గురి చేస్తున్నాడు. ఆ క్రమం ఆ విద్యార్థిని యువకుడికి ఎదురు తిరిగింది. దాంతో అతడు ఆగ్రహంతో ప్రేమించకపోతే చంపేస్తానంటూ బెదిరించాడు. అ బాలిక తీవ్రంగా భయపడి ఒంటిపై  కిరోసిన్ పోసుకుని నిప్పంటించుకుంది.

మరిన్ని వార్తలు