బంజారాహిల్స్: జూబ్లీహిల్స్ చెక్పోస్టులో ట్రాఫిక్ పోలీసులు నిర్వహించిన డ్రంక్ అండ్ డ్రైవ్లో తొమ్మిది మంది పట్టుబడ్డారు. అతిగా మద్యం సేవించి వాహనాలు నడుపుతుండగా.. ఏడు కార్లు, ఒక ఆటో, ఒక ద్విచక్ర వాహనాన్ని స్వాధీనం చేసుకుని కేసులు నమోదు చేశారు. తొమ్మిది మందిని అదుపులోకి తీసుకున్నారు. పట్టుబడిన వారికి సోమవారం కౌన్సెలింగ్ నిర్వహించి మంగళవారం ప్రత్యేక న్యాయస్థానంలో హాజరు పరుస్తామని పోలీసులు తెలిపారు. ఈ తనిఖీల్లో అప్పాలో శిక్షణ పొందుతున్న పది మంది ఎస్ఐలు పాల్గొని డ్రంక్ అండ్ డ్రైవ్ తీరును పరిశీలించారు.