నిరుద్యోగులకు కుచ్చుటోపీ పెట్టిన ఓ కన్సల్టెన్సీ

8 Jul, 2016 15:53 IST|Sakshi
నిరుద్యోగులకు కుచ్చుటోపీ పెట్టిన ఓ కన్సల్టెన్సీ

తార్నాకలో ఎస్‌కే గ్లోబల్ కన్సల్టెన్సీ నిరుద్యోగులకు కుచ్చుటోపీ పెట్టింది. సుమారు 200 మంది నిరుద్యోగులకు విదేశాలలో ఉద్యోగాలు ఇప్పిస్తామంటూ రూ.2 కోట్ల వరకు వసూలు చేసి రాత్రికి రాత్రే దుకాణం సర్దేశారు. ఒక్కొక్కరి వద్ద రూ.50 వేల నుంచి లక్షన్నర వరకు నిర్వాహకుడు పవన్ కుమార్ వసూలు చేసినట్లు తెలిసింది. ఈ ఘటనపై బాధితులు ఓయూ పోలీసు స్టేషన్‌లో ఫిర్యాదు చేశారు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు ప్రారంభించారు.

 

మరిన్ని వార్తలు